క్రితంటపా లో చెప్పుకున్నట్టుగా సమస్యాపాదములో కొన్నిసార్లు ఎక్కువపదాలుకానీ లేదా తక్కువపదాలు కానీ ఇవ్వడమనేది అవధాని యొక్క ప్రజ్ఞకు,పాండిత్యానికి ఒక పరీక్షలాంటిది. క్రింది సమస్యను చూడండి .
కపిన్ పూజలు చేసె రాముడు కపుల్ కనగా కపిలేని వేళలోన్.
అవధాని గారు కపిని వృషాకపిగా మార్చి సమస్యను పరిష్కరించారు. "హరవిష్ణో వృషాకపి" అని అమరము. వృషాకపి అంటే విష్ణువు, ఈశ్వరుడు అని అర్థము. మరి అవధాని గారియొక్క సమస్యాపూరణము చూసిన తరువాత ఇంత తేలికగా సమస్యలను పూరించవచ్చా అనే భావన కలుగుతుందనడములో సందేహము లేదు.
ఈ జననంబు ధన్యమయి హేమసువర్ణ విశీర్ణ పాత్రమై,
భ్రాజదనన్య రూప గుణరాఢ్య శిఖామణి దేవదేవతా
రాజిత పాదయుగ్మక నిరంతర పూజితు నావృషాకపిన్
పూజలు చేసె రాముడు కపుల్ కనగా కపిలేని వేళలోన్.
అవధాని మాడుగుల నాగఫణిశర్మ గారికి నా మన:పూర్వక శిరసాభివందనములు.
No comments:
Post a Comment