Friday, 19 February 2016

కవిమిత్రులకు వందనములు. 
మొన్న తిరుపతి నుండి కడపకు పోవుచుండగా మధ్యలో పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట దేవస్థానము రాగా అప్పుడు వ్రాసిన పద్యము. 

శ్రీరఘురాము పాదములఁ చింతన జేయుదు సార హీన సం
సారవిచారభావనలు చాలని ప్రక్కకు నెట్టి మీ దయా
సారము నాకు చాలని యసంగతబుద్ధి విముక్తుఁడై మహో
దారగుణాభిరామ! శథతా నిను వేడెద మమ్ము గాచుమా!

శ్రీరామపట్టాభిషేక చిత్రపటము చూసి వ్రాసిన పద్యము................    

రాముని కన్న నెవ్వరు పరాక్రమశాలురు తేరిచూడ సం
గ్రామమునందు నుగ్రతర రాక్షసవీరుల సంహరించె ను
ద్ధామ గుణాభిరాముఁడు విధాతకుఁ బూర్వుఁడు భక్త బాందవ
శ్యాముఁడు మమ్ము కాచగ నసాధ్యందేది ఘటించునిద్ధరన్.