Friday, 19 February 2016

కవిమిత్రులకు వందనములు. 
మొన్న తిరుపతి నుండి కడపకు పోవుచుండగా మధ్యలో పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట దేవస్థానము రాగా అప్పుడు వ్రాసిన పద్యము. 

శ్రీరఘురాము పాదములఁ చింతన జేయుదు సార హీన సం
సారవిచారభావనలు చాలని ప్రక్కకు నెట్టి మీ దయా
సారము నాకు చాలని యసంగతబుద్ధి విముక్తుఁడై మహో
దారగుణాభిరామ! శథతా నిను వేడెద మమ్ము గాచుమా!

No comments:

Post a Comment